జగన్ పార్టీలోకి ధర్మాన

 

జగన్‌మోహన్‌ రెడ్డి అక్రమాస్తుల కేసులో పదవి కోల్పోవటంతో పాటు కోర్టుల చుట్టూ తిరుగుతున్న ధర్మాన ప్రసాద్‌ రావు త్వరలో పార్టీ మారున్నారు. ఇప్పటికే ప్రసాద్‌రావు తమ్ముడు కృష్ణదాస్‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతుండగా ఇప్పుడు ధర్మాన ప్రసాద్‌ రావు కూడా అదే పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారు.  రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెడితే తాను కాంగ్రెస్ పార్టీని వీడతానని మాజీమం త్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు గతంలోనే చెప్పారు. అయితే ఇటీవల పలు ప్రెస్‌మీట్‌లలో జగన్‌కు వ్యతిరేఖంగా స్టేట్‌మెంట్స్‌ ఇవ్వటంతో పాటు రాజశేఖర్‌ రెడ్డిని కూడా విమర్శించిన ధర్మానకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఎలాంటి స్థానం కల్పిస్తారన్న చర్చ మొదలైంది.