రేపటి నుండి తెలంగాణ బిల్లు పై చర్చ
posted on Dec 17, 2013 4:05PM
తెలంగాణ ముసాయిదా బిల్లుపై రేపటి నుంచి మూడు రోజుల పాటు వరకు చర్చ జరుగుతుందని బీఏసీ సమావేశంలో నిర్ణయించినట్లు శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. బిల్లులో ఏ క్లాజ్లు ఉన్నాయో దానిపై ప్రతి ప్రభ్యుడు చర్చించడానికి బీఏసీలో నిర్ణయం జరిగిందని ఆయన తెలిపారు.
అయితే టీ. బిల్లు సరిగాలేదని, తిప్పి పంపాలని టీడీపీ సభ్యులు కోరారని, కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత దానిని రాష్ట్రపతి కూడా అంగీకరించి రాష్ట్రానికి పంపిన తెలంగాణ ముసాయిదా బిల్లును తిప్పి పంపడం సరికాదని, దీనిపై రేపట్నించే చర్చ జరుగుతుందని స్పీకర్ స్పష్టం చేశారు. సభ్యులందరూ తమ తమ అభిప్రాయాలు చెప్పాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని బీఏసీ సమావేశం ముగిసిన అనంతరం స్పీకర్ నాదెండ్ల అసెంబ్లీలో ప్రకటన చేశారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.