శాసనసభలో శాడిజం... దామోదర

 

 

 

శాసనసభ వ్యవహారాలు చూస్తుంటే చిరాకేస్తుంది. శాడిజం పెరిగిపోతోంది. ఇతరులు అసహనానికి గురయ్యేలా మాట్లాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అసహనం వ్యక్తం చేశారు. శాస్త్రీయత, అవగాహన, అధ్యయనం లేకుండా ఇతరులను అగౌరవపరచేలా మాట్లాడుతున్నారని అన్నారు. శాసనసభ వ్యవహారాలను పరిశీలిస్తుంటే ఎలాంటి చర్చ జరగదని స్పష్టం అవుతోందన్నారు. బిల్లుపై చర్చ కొనసాగుతుందని ఒకవైపు శాసనసభలో ప్రతిరోజూ విడుదల చేస్తోన్న బులిటెన్‌లో పేర్కొంటుండగా, మరోవైపు ఇంకా చర్చ ప్రారంభం కాలేదని కొందరు అనడం మూర్ఖత్వమే అవుతుందని రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ సమైక్యవాదం గురించి సభలో రెండు గంటలు మాట్లాడితే, ప్రతిగా తాను దీటైన సమాధానం చెబుతానన్నారు.