జయ ఆరోగ్యంపై స్వామి ట్వీట్... అభిమానుల్లో టెన్షన్...

 

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన ట్వీట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. అదేంటంటే... తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం గురించి. గుండెపోటుకు గురై చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను పరామర్శించేందుకు గాను స్వామి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన ట్విట్టర్ ఖాతాలో అమ్మ ఆరోగ్యంపై ట్వీట్ చేశారు. 'సాయంత్రం 6. గంటలకు జయలలిత గురించి ఓ కీలక ప్రకటన వింటారు' అని స్వామి ట్వీట్ చేశారు. మరి స్వామి ట్వీట్ లోని ఆంతర్యం ఏమై ఉంటుందని ఆందరూ ఆలోచిస్తున్నారు. మరోవైపు అమ్మ అభిమానులు మాత్రం స్వామి ట్వీట్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.