స్మార్ట్‌ పల్స్‌ సర్వే ప్రారంభించిన చంద్రబాబు..

 

ఏపీ సీఎం చంద్రబాబు స్మార్ట్‌ పల్స్‌ సర్వే ను తన నివాసం నుండే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యుల వివరాలను అధికారులు సేకరించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఇది ఒక వినూత్న కార్యక్రమమని, ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం కాకుండా ఈ సర్వే ఉపయోగపడుతుందని అన్నారు. పల్స్‌ సర్వేతో అందరి స్థితిగతులు తెలుస్తాయని, వెనుకబడినవారిని పైకి తెచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఇక ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పల్స్ సర్వేను ప్రారంభించారు.