ఏపీ టీడీపీ ఓకే.. కానీ ఎమ్మెల్యేలే..!


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పుడప్పుడూ అధికారులు, మంత్రుల పనితీరును బట్టి ర్యాంకులు ఇస్తుంటారు. అది తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఆయన తాజాగా నిర్వహించిన ఓ సర్వే ప్రకారం మాత్రం టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో సంతృప్తి లేదట. ఆ వివరాలేంటే ఓ లుక్కేద్దాం.. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు స్వయంగా తానే ఓ సర్వే చేయించారు. ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది? ఎమ్మెల్యేల పనితీరు ఏ మేరకు ఉంది? అన్న కోణంలో చేయించిన ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. సర్వే ప్రకారం.. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారంట కానీ.. ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం సంతృప్తిగా లేరంట. ఇక దీనిపై స్పందించిన చంద్రబాబు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పనితీరుకు అనుగుణంగా ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగుపరచుకోకపోతే ఎలాగంటూ మండిపడ్డారంట. అంతేకాకుండా పనితీరు బాగాలేని ఎమ్మెల్యేల పనిబట్టాలని ఓ కమిటి ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు నిర్ణయించారు.