TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గెట్-టుగెదర్ పార్టీలో విషాదం

Published on: Sun Jun 14, 2026 3:17PM

 

ఫామ్‌హౌస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి..

స్నేహితులతో కలిసి సరదాగా గడపాలని నిర్వహించిన గెట్-టుగెదర్ పార్టీ విషాదాంతంగా మారింది. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీలో మంచిర్యాల జిల్లాకు చెందిన గండ్ల రాము (27)  అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. కొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కలిసి ఫామ్‌ హౌస్‌లో గెట్-టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి రాము కూడా హాజరయ్యారు.అర్థరాత్రి వరకు అందరూ కలిసి ఎంజాయ్ చేశారు. అయితే రాము  అకస్మాత్తుగా కుప్ప కూలి కింద పడిపోయాడు. 

అందరూ రాము వద్దకు వెళ్లి చూడగా అప్పటికే అతను మృతి చెందాడు. రాము మృతి చెందడంతో అక్కడున్న వారందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదే హాన్ని పోస్టుమార్టం ప్రభు త్వాసుపత్రికి తరలించారు. ఘటనపై అనుమానాలు వ్యక్తం చేసిన మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఘటన సమయంలో ఫామ్‌ హౌస్‌లో ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడి మరణానికి అసలు కారణం ఏమిటి? ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక మరేదైనా కోణం ఉందా? అన్న విషయాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే యువకుడి మరణానికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలి పారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.