చిత్తూరు కార్పొరేషన్‌లో తెలుగుదేశం విజయం ఖాయం

 

 

 

సీమాంధ్రలో తెలుగుదేశం హవా కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ బలం పెరుగుతూ వుంది. సీమాంధ్రలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కొన్ని మునిపిపాలిటీలను గెలుచుకుంది. చాలా మునిసిపాలిటీలలో ముందంజలో వుంది. అలాగే కార్పొరేషన్ ఫలితాలలో కూడా తెలుగుదేశం పార్టీ ముందంజలో వుంది. చిత్తూరు కార్పొరేషన్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిత్తూరులోని 50 కొర్పొరేషన్ స్థానాల తెలుగుదేశం పార్టీ 20 స్థానాలను ఇప్పటికే గెలుచుకుంది. ఈ కార్పొరేషన్ మీద బాగా ఆశలు పెట్టుకున్న వైకాపా 3 స్థానాల్లో మాత్రం విజయం సాధించింది. ఇండిపెండెంట్లు 4 స్థానాల్లో గెలిచి వైకాపా కంటే అగ్రస్థానంలో వున్నారు.