ఉద్రిక్తంగా మారిన విహెచ్‌పి యాత్ర

 

అయోధ్యలో విశ్వహిందూ ప‌రిష‌త్ త‌ల‌పెట్టిన చౌరాసీ కోసి పరిక్రమ యాత్ర ఉద్రిక్తంగా మారింది. యాత్రకు వ‌స్తున్న విహెచ్‌పి నేత‌లు అశోక్ సింఘాల్‌, ప్రవీణ్ తొగాడియాల‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అశోక్ సింఘాల్ ను లక్నోలో అరెస్ట్ చేయగా, తొగాడియాను అయోధ్యలో అదుపులోకి తీసుకున్నారు.ఈ అరెస్ట్‌ల‌ను నిర‌సిస్తూ రేప‌ట్నుంచి దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న చేప‌ట్టనున్నట్టు తొగాడియా ప్రక‌టించారు.
 
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పై పోరాటానిక దిగిన విహెచ్‌పి అయోధ్య యాత్రకు సిద్దమ‌యింది. వందలాది మంది కార్యక‌ర్తల‌తో భారీ ర్యాలీ త‌ల‌పెట్టగా ముంద‌స్తూ జాగ్రత్తల కింద పోలీసులు నాయ‌కులుతో స‌హా కార్యకర్తల‌ను కూడా అరెస్ట్ చేశారు.అరెస్టయిన వారిలో ఓ మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఉన్నారు.

పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా య‌త్ర చేసి తీరుతామ‌ని విహెచ్‌పి ప్రక‌టించిన నేప‌ధ్యంలో అయోధ్యలో క‌ట్టుదిట్టమైన భ‌ద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఏర్పడింది. దుకాణాలు మొత్తం మూసేశారు.