టీడీపీ అభ్యర్థులందరితో చంద్రబాబు మీటింగ్

 

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 22న రాష్ట్ర రాజధాని అమరావతిలో తమ పార్టీకి చెందిన 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 25 మంది ఎంపీ అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. తాజాగా టీడీపీ అభ్యర్థులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు.. పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు చంద్రబాబుకు ఎన్నికల సంఘం తీరుపై ఫిర్యాదులు చేశారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, ఈసీపై తమ పోరాటం ఆ అవకతవకలపైనే అని స్పష్టం చేశారు. అలాగే అమరావతిలో జరిగే సమావేశానికి పార్టీ అభ్యర్థులందరూ హాజరుకావాలని చంద్రబాబు ప్రత్యేకంగా కోరారు.