విభజనలో తొలి ముద్దాయి సోనియానే: బాబు

 

Chandrababu requests President to halt bifurcation, Chandrababu bifurcation, tdp telangana, telangana bill

 

 

రాష్ట్ర విభజనను ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అని టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రపతిని కలిసి విభజనపై చర్చించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఒక ప్రాతిపదిక అంటూ లేకుండా విభజించారని విమర్శించారు. కాంగ్రెస్ రాజకీయాల వల్లే తెలుగుజాతి విచ్చిన్నం దశకు చేరుకుందన్నారు. రాష్ట్రం ఎంత త్వరగా విడిపోతే అంత మంచిదని తెరాస, వైకాపాలను ఆయన దుయ్యబట్టారు. సమన్యాయం చేయాలనే తెలుగుదేశం కోరుతోందన్నారు.