చంద్రబాబు దీక్షకు వర్షం దెబ్బ

 


Video courtesy TV9

 

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్రలో వచ్చే ఇబ్బందులకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ గత ఐదు రోజులుగా ఢిల్లీలోని ఏపీభవన్ లో చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వరుణుడు అడ్డంకులు సృష్టిస్తున్నాడు. రెండు రోజుల క్రితం వర్షం కారణంగా ఏపీ భవన్ లో దీక్ష శిబిరం తడిసిపోయింది. ఇక తాజాగా ఈ రోజు కూడా ఢిల్లీలో కురిసిన భారీ వర్షంతో బాబు దీక్షా శిబిరం తడిసిపోయింది. దీంతో అక్కడ దీక్షలో ఉన్న చంద్రబాబు తో సహా నాయకులంతా ఇబ్బందికి గురయ్యారు.

 


శిబిరంలోని టెంట్లు తడిసి ప్రాంగణం అంతా నీరు చేరింది. ఇక దీక్ష నేపథ్యంలో బాబుకు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులు రెండుసార్లు పరీక్షలు నిర్వహించారు. ఆనంతరం వారు కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి, న్యూఢిల్లీ డిసిపి, ఎపి భవన్ రెసిడెంట్ కమిషనర్, ఆరోగ్య విభాగం డైరెక్టర్ జనరల్‌కు ఒక నివేదికను సమర్పించారు. దీక్ష మూలంగా బాబు మూడు కిలోల బరువు తగ్గారు. షుగర్, బీపీ లెవెల్స్ లో తేడా వచ్చింది.