జపాన్ ప్రధానితో బాబు..అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానం

 

జపాన్ ప్రధాని షింజో అబే తో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.ఎపి కొత్త రాజదాని అమరావతి నిర్మాణానికి జరిగే శంకుస్థాపన ఉత్సవంలో పాల్గొనాలని ఈ సందర్భంగా ప్రదానిని కోరారు. తిరుమల శ్రీవెంకటేశ్వరుని శేషవస్త్రం, ప్రసాదం, మెమెంటోని చంద్రబాబు ఆయనకు బహుకరించారు.రాజధాని నిర్మాణంలో , పరిశ్రమల స్థాపనలోను ఎపికి సహకరించాలని ఆయనకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాజధాని కి మౌలిక వసతుల ఏర్పాటులో, సాంకేతిక పరిజ్ఞానం అందించడం లో జపాన్ సహకరిస్తుందని ఆ దేశ ప్రధాని హామీ ఇచ్చారు.అమరవాతి నగర శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని జపాన్‌ ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి కూడా ఆహ్వాన లేఖ వస్తుందన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన షింజో అబే వీలు చూసుకుని వస్తానని చంద్రబాబుకు తెలిపారు.