చంద్రబాబు దీక్ష భగ్నం

 

 

Video courtesy ETV2

 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆమరణ నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం భగ్నం చేశారు. రాష్ట్ర విభజన ఆపాలని, సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలని, ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగేలా గత ఐదు రోజులుగా ఢిల్లీలోని ఏపీభవన్ లో నిరహార దీక్ష చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని వైద్యులు చెప్పడంతో ఉదయం నుండి ఏపీ భవన్ రహదారులు బంద్ చేసిన పోలీసులు బలవంతంగా బాబును రామ్ మనోహన్ లోహిలా ఆసుపత్రికి తరలించారు. బాబు తరలింపును అడ్డుకున్న కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. చంద్రబాబు నాయుడు దీక్ష దేశాన్ని ఆకర్షించిందని, ఆయన దీక్ష మూలంగానే కేంద్ర ప్రభుత్వం కదిలిందని, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా చంద్రబాబు తెలుగు ప్రజల కొరకు పోరాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు.