ఎంపిలో తరిమితే ఏపీపై పడ్డారు: బాబు

 

 

 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిగ్విజయ్ సింగ్ పై ట్విట్టర్ లో విమర్శనాస్త్రాలు సంధించారు. మధ్యప్రదేశ్‌లో తరిమితే దిగ్విజయ్ ఇక్కడికొచ్చి పెత్తనం చెలాయిస్తున్నారు, విభజన రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్‌లో పునరావాసం కోసం దిగ్విజయ్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 3 గంటలు, పట్టణాల్లో 6 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 12 గంటల విద్యుత్ కోతలున్నాయని, అయితే విద్యుత్‌శాఖకు మంత్రే లేరని ఆయన అన్నారు. కాంగ్రెస్ అవీనితి, అసమర్ధ పాలనకు ప్రజలు పన్నులు కట్టే దుస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు.