నేను బొబ్బిలి పులినే..దాసరి
posted on Jun 12, 2013 3:03PM
మాజీ కేంద్ర బొగ్గు సహాయమంత్రి, దర్శకరత్న దాసరి నారాయణవు ను బొగ్గు కుంభకోణంలో సిబిఐ ఎఫ్ఐఆర్ లో నిందితుడిగా పేర్కొన్నడం పై స్పందించారు. 'ఒక పథకం ప్రకారం నా మీద అసత్య ప్రచారం జరుగుతోంది. నిజానిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయి. అంతవరకూ ఆందోళన చెందకుండా అభిమానులు ఓపిక పట్టాలి. నేను ఎప్పటికీ బొబ్బిలిపులినే' అని అన్నారు. దాసరిని ఎఫ్ఐఆర్ లో నిందితుడిగా పేర్కొన్న సీబీఐ జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీకి లాభం చేకూరేలా చేశారని, ఆయన చేసిన మేలుకు ప్రతిఫలంగా ఆయనకు చెందిన సౌజన్య మీడియాలోకి రూ.2.5 కోట్లు పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఢిల్లీ నుండి వచ్చిన సీబీఐ అధికారులు దాసరి నివాసంలో, సిరి మీడియా, సౌజన్య మీడియా కార్యాలయాలలో సోదాలు నిర్వహించారు.