మూడు రోజుల్లో పూర్తి అభ్యర్థుల జాబితా: బొత్స
Published on: Tue May 1, 2012 3:29PM
మంగళవార౦ ఢిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో అధికారికంగా అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకొని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని బొత్స చెప్పారు. ఈ అంశంపై పార్టీ నేతలతో సాయంత్రం మరోసారి భేటీ అవుతామని చెప్పారు. కాగా ఇప్పటి వరకు అధిష్టానం పలు నియోజకవర్గాల అభ్యర్థులకు ఆమోదముద్ర వేసిందని తెలుస్తోంది. వారిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. టిక్కెట్ల ఖరారు గురించి చంద్రబాబు విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. ఇప్పటి వరకు అభ్యర్థులను ఖరారు చేయలేని పరిస్థితి వారిది అని అన్నారు.


