పెంపుడు కుక్కలమే: బొత్స

 

 

 

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నేతలని సోనియాగాంధీ పెంపుడు కుక్కలు అని అనడంపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అవును పెంపుడు కుక్కలు పార్టీకి విశ్వాసంగా ఉంటాయి. మమ్మల్ని నమ్ముకున్న పార్టీకి, ప్రజలకు కుక్కల్లా విశ్వాసంగా ఉంటాం. కానీ చంద్రబాబు మాత్రం గుంట నక్క. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన నేత. ఇలాంటి భాష వాడడం ఏమిటని, పద్దతిగా వ్యవహరించాలని చంద్రబాబుకు సలహా ఇచ్చారు.

 

షర్మిల తాము విభజన చెప్పలేదని అనడాన్ని ఆయన ఖండించి ఎందుకు ప్రజలను మోసం చేస్తారని బొత్స ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రెండు రాజకీయ లబ్దికోసం పాకులాడుతున్నాయి. రాష్ట్ర విభజన మీద నిర్ణయం జరిగిందని, ఇప్పుడు నిరసనలతో లాభం లేదని, సీమాంధ్రలో రవాణా స్థంభించిందని, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి సహకరించాలని బొత్స కోరారు.