ప్రీతీజింటా లేఖ.. బాలీవుడ్లో సంచలనం!
posted on Jul 23, 2014 11:40AM
తన మాజీ ప్రియుడు నెస్ వాడియా తనను మానసికంగా, శారీరకంగా హింసించాడంటూ ఫిర్యాదు చేస్తూ ప్రీతీజింటా మంగళవారం ముంబై పోలీసు కమిషనర్కి రాసిన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ప్రీతీజింటా బాలీవుడ్ సహచరులు ఈ లేఖలోని విషయాలను తెలుసుకుని బిత్తరపోయారు. వారంతా ఈ అంశంలో షాకింగ్ ఎక్స్.పీరియన్స్ అనుభవిస్తున్నారని చెప్పవచ్చు. తమ మధ్య నవ్వుతూ, తుళ్ళుతూ వుంటూ, క్రికెట్ టీమ్ ఓనర్గా కూడా యాక్టివ్గా వుంటే ప్రీతీజింటా జీవితంలో ఇన్ని చీకటి కోణాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారు. నెస్ వాడియాతో ప్రీతీజింటాకి వున్న గొడవలు టీ కప్పులో తుఫానులాగా సమసిపోతాయని వారంతా భావించారు. అయితే మేటర్ చాలా సీరియస్గా వుందన్న విషయం ప్రీతీజింటా తాజా లేఖతో బయటపడటంతో వారందరూ ప్రీతీ జింటా మీద సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య నుంచి ప్రీతీ జింటా సాధ్యమైనంత త్వరగా బయటపడాలని బాలీవుడ్ కోరుకుంటోంది.