అక్కినేనికి శాసనసభ సంతాపం

 

 

 

ప్రముఖ నటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల శాసనసభ ప్రగాఢ సంతాపం ప్రకటించింది. శాసనసభ ప్రారంభం కాగానే స్పీకర్ నాదెండ్ల మనోహర్ అక్కినేని మృతిపట్ల సంతాప తీర్మానం ప్రకటించారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ విరాజిల్లడానికి అక్కినేని ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. చలనచిత్ర నటుడిగానే కాకుండా సంఘజీవిగా అక్కినేని పలు సేవలు అందించారని అన్నారు. టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రాంతాలకు అతీతంగా ఇలాంటి మహనీయులను స్మరించుకోవాలని అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అక్కినేని మరణం వల్ల దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని అన్నారు.