ఎపీ అసెంబ్లీ: ధూళిపాళ్ల vs జగన్

 

 

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా టిడిపి సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేటాయించిన భూములపై ఆయన ఆరోపణలు చేయడం వివాదంగా మారింది. బ్రాహ్మణి భూ కేటాయింపుల, ఓబులాపురం గనుల అక్రమాలపై ఆయన పలుమార్లు ప్రశ్నించడంపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతున్నప్పుడు సభలో లేని వ్యక్తిపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. సభలో లేని వ్యక్తులపై ఆరోపణలు చేయరాదని నిబంధన ఉన్నప్పట్టి టిడిపి నేతలు ఎలా ఆరోపణలు చేస్తారని జగన్ ప్రశ్నించారు. దీనికి టిడిపి నేత ధూళిపాళ్ల నరేంద్ర బదులిస్తూ.. తాను ఎవరి వ్యక్తిగత జీవితాలపై ఆరోపణలు చేయలేదని..గత ప్రభుత్వం హయంలో జరిగిన అవినీతి, అక్రమాలను మాత్రమే ప్రస్తావిస్తూనని తెలిపారు.