ఏపీ సచివాలయం వద్ద ఆత్మహత్య...

 

ఏపీ సచివాలయం వద్ద దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి సచివాలయం వద్దే ఆత్మహత్యకు పాల్పడినఘటన కలకలం రేపుతోంది. అప్పుల బాధ పడలేక ఓ ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్యచేసుకున్నాడు. వివరాల ప్రకారం.. రాజగోపాల్‌ అనే ఆర్‌ఎంపీ వైద్యుడు చంద్రబాబు నాయుడి అపాయింట్‌మెంట్‌ కోసం శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వెలగపూడిలోని సచివాలయం వద్ద వేచి చూశాడు. కానీ అపాయింట్ మెంట్ మాత్రం దొరకలేదు. దీంతో వెంట తెచ్చుకున్న పురుగుల మందును అక్కడికక్కడే తాగేశాడు. రాజగోపాల్‌  పురుగుల మందు తాగడం గమనించిన సచివాలయ సిబ్బంది ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజగోపాల్‌ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందినట్టు సమాచారం.