పవన్ ట్వీట్.. అమితాబ్ రీ ట్వీట్.!!

 

లక్షల మంది సైనికులు దేశ సరిహద్దుల్లో కంటిమీద కునుకు లేకుండా శత్రుదేశాల నుండి కాపాడుతున్నారు కాబట్టే కోట్ల మంది ప్రజలు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు.. అందుకే అంటారు అన్నం పెట్టే రైతుకి, దేశ ప్రజల ప్రాణాలు కాపాడటానికి తన ప్రాణం అడ్డుపెట్టే సైనికుడికి జీవితాంతం రుణపడి ఉండాలని.. గత కొన్ని రోజులుగా కేరళను వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే.. ఈ వరదలు కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోయారు.. వేలమంది నిరాశ్రయులయ్యారు.. కేరళకు అండగా నిలబడటానికి అనేక మంది ఆర్థికసాయం చేయటానికి ముందుకొచ్చారు.. మరి సైనికులు వారి పక్కనే ఉండి ధైర్యం చెప్తున్నారు.. విరామం లేకుండా సేవ చేస్తున్నారు.. వారి సేవే జనసేనాని పవన్ ట్వీట్ కి కారణమైంది.

 

 

మాతృభూమిని కాపాడుతున్న భారత సైనికులకు సలాం అంటూ ట్వీట్ చేసారు.. అంతేకాదు ఆ ట్వీట్ లో, గతంలో సైనిక ఉన్నతాధికారులు భరతమాత, భారత సైన్యం గురించి చేసిన వ్యాఖ్యలని జత చేసారు.. పవన్ చేసిన ఈ ట్వీట్ కు భారీ స్పందన వచ్చింది.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా పవన్ ట్వీట్ పై స్పందించారు.. 'జై హింద్, వి సెల్యూట్ ఔర్ భారత్' అంటూ రీట్వీట్ చేసారు.. దీనికి బదులుగా పవన్, అమితాబ్ కి కృతఙ్ఞతలు చెప్తూ మరో ట్వీట్ చేసారు.. కృతజ్ఞతలతో పాటు, భారత జవాన్ల ధైర్య సాహసాలపై ఎకె రామానుజన్ అనువాదం చేసిన ఓ పద్యాన్ని కూడా జత చేసారు.. మొత్తానికి జవాన్లకు సెల్యూట్ చేస్తూ జనసేనాని చేసిన ట్వీట్ కు భారీ స్పందన వస్తుంది.