ఎయిర్ ఇండియా విమానంకు తప్పిన ముప్పు...


ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. అలహాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం  టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తిందని పైలట్లు గమనించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ సిబ్బందికి సమాచారం అందించగా.. అలహాబాద్ లోని ఎయిర్ పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం క్షేమంగా ల్యాండ్ అవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను వేరే విమానంలో పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా ప్రయాణాన్ని రద్దు చేసుకున్న ప్రయాణికులకు టికెట్ సొమ్మును రీఫండ్ చేశామని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ మిశ్రా తెలిపారు.