నేనూ ఓ కార్యకర్తనే.. కార్యకర్తలే నా కుటుంబం. చంద్రబాబు

 

టీడీపీ కార్యకర్తలు చేసుకునే ఏకైక పండుగ మహానాడు అని.. నేనూ ఏ కార్యకర్తనే అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు కార్యక్రమంలో అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యుగపురుషుడి జన్మదినం సందర్భంగా మహానాడు జరుపుకుంటున్నాం.. ఎన్టీఆర్ పుట్టినరోజు తెలుగుజాతి పండుగరోజు.. తెలుగు జాతి ఎన్నటికీ మరిచిపోలేని నేత ఆయన.. తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక నేత ఎన్టీఆర్.. అని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం కార్యకర్తలు అనేక త్యాగాలు చేశారు.. నేనూ ఓ కార్యకర్తనే.. నేను మిమ్మల్ని ఎప్పుడూ ఓ కార్యకర్తల్లా చూడలేదు.. నా కుటుంబ సభ్యుల్లానే చూశానని చెప్పారు. ఆస్తులు అమ్ముకుని మరీ పార్టీ కోసం ఖర్చు పెట్టారు..ప్రాణ త్యాగం చేశారు.. అటువంటి వారిని తెలుగుదేశం ఎన్నడూ మరచిపోదన్నారు. తాను పార్టీ అధ్యక్షుడిగానే కాకుండా తెలుగుదేశం కుటుంబ పెద్దగా కార్యకర్తలందరికీ అండగా ఉంటానని చంద్రబాబునాయుుడ చెప్పారు.