మేం ఎవ్వరికీ మద్దతివ్వడం లేదు..

 

కేంద్ర పభుత్వ తీరుపై పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో టీడీపీకి ఇప్పటికే పలు పార్టీలు మద్దతునిచ్చాయి. అయితే అవిశ్వాస తీర్మానం విషయంలో శివసేన మద్దతిస్తుందా.. ? లేదా..? అని.. బీజేపీ పై గుర్రుగా ఉంది కావున మద్దతిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు శివసేన ఆశ్చర్యపరిచే ప్రకటన చేశారు. ఈ రోజు ఆ పార్టీ ఎంపీ అరవింద్ సావంత్ ‘‘మేం ప్రభుత్వానికి మద్దతు పలకడం లేదు. అలాగని విపక్షానికీ మద్దతు ఇవ్వడం లేదు. మేం దూరంగా ఉంటాం’’ అంటూ ఆయన ప్రకటన చేశారు. కాగా ఇటీవలే బీజేపీ మిత్రపక్షం నుండి శివసేన బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.