జయలలిత పూర్తిగా కోలుకున్నారు..హాస్ప‌ిట‌ల్ చైర్మ‌న్

 

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను క్రిటికల్ కేరు యూనిట్(సీసీయూ) నుండి వేరే గదిలోకి మార్చుతున్నామని.. ఆమె ఆరోగ్యం కుదుపపడిందని అన్నాడీఎంకే నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె ఆరోగ్యం మరింత క్లారిటీ వచ్చింది. జ‌య‌ల‌లిత పూర్తిగా కోలుకున్నార‌ని అపోలో హాస్ప‌ిట‌ల్ చైర్మ‌న్ ప్ర‌తాప్ రెడ్డి తెలిపారు. చెన్నైలో జరిగిన పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ జయన ఆరోగ్యంపై స్పందిస్తూ.. పైవిధంగా వ్యాఖ్యానించారు. జ‌య పూర్తిగా స్పృహ‌లోకి వ‌చ్చార‌ని, త‌న చుట్టు జ‌రుగుతున్న విష‌యాలు ఆమె గ్ర‌హించ‌గ‌లుతున్నారని ఆయ‌న చెప్పారు. త‌న‌కు కావాల్సిన వాటిని ఆమె అడుగుతున్నార‌ని ప్ర‌తాప్ రెడ్డి తెలిపారు. పూర్తిగా కోలుకున్న జ‌య‌ల‌లిత‌ను త్వ‌ర‌లోనే క్రిటిక‌ల్ కేర్ యూనిట్ నుంచి త‌ర‌లించే అవ‌కాశాలున్నాయి. కాగా జయలలిత గత కొద్ది కాలంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.