అందుకే 'మగధీర' ఆఫర్ వదులుకున్నా!
on Jul 6, 2022
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి సినిమాలో నటించే అవకాశమొస్తే స్టార్స్ సైతం ఎగిరిగంతేస్తారు. ఎందరో స్టార్స్ ఆయన సినిమాల్లో చిన్న రోల్స్ చేయడానికి కూడా వెనకాడరు. కానీ నటి అర్చన మాత్రం ఆయన దర్శకత్వంలో వహించిన 'మగధీర'లో నటించే అవకాశమొస్తే వదులుకున్నారట.
ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షోలో తన భర్త జగదీష్ తో కలిసి అర్చన పాల్గొన్నారు. ఈ షోలో ఆమె మాట్లాడుతూ 'మగధీర' అవకాశం వదులుకోవడానికి ఓ రకంగా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' కారణమని చెప్పారు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'లో త్రిష ఫ్రెండ్ గా అర్చన నటించిన విషయం తెలిసిందే. ఆ పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. అదే సమయంలో బాపు దర్శకత్వంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని పోగొట్టింది. బాపు డైరెక్ట్ చేసిన 'రాధా గోపాళం'లో హీరోయిన్ గా నటించే అవకాశం మొదట అర్చనకు వచ్చిందట. అయితే అదే సమయంలో ఆమె 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'లో హీరోయిన్ ఫ్రెండ్ గా నటిస్తుందని తెలిసి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయిందంటూ 'రాధా గోపాళం' నుంచి ఆమెను తీసేశారట. దానిని దృష్టిలో పెట్టుకునే అర్చన మగధీరకు నో చెప్పారట.
'మగధీర'లో సలోని పోషించిన పాత్ర కోసం ముందుగా అర్చనను సంప్రదించారట. అయితే ఇలాంటి చిన్న పాత్రలు చేస్తే, 'రాధా గోపాళం' విషయంలో జరిగినట్లుగా పెద్ద అవకాశాలు రావేమోనన్న భయంతో ఆమె చేయలేదట. కానీ 'మగధీర'లో చిన్న రోల్ లో మెరిసిన సలోనికి రాజమౌళి తన తదుపరి సినిమా 'మర్యాద రామన్న'లో హీరోయిన్ గా అవకాశమిచ్చారు. ఒకవేళ తాను 'మగధీర'లో నటించి ఉంటే.. 'మర్యాద రామన్న'లో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చేదేమో అంటూ అర్చన చెప్పుకొచ్చారు.
Also Read