విష్ణుప్రియ, రీతూ పరువు తీసిన ప్రదీప్!
on Jul 6, 2022
ఆహా ఓటిటి వేదికపై కొత్త మూవీస్ తో పాటు గేమ్ షోస్ కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అలాంటి ఒక ఫేమస్ గేమ్ షో ఐన 'సర్కార్ 2' లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ మాచిరాజు వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ స్టేజి మీదకి నలుగురు తెలివైన వాళ్ళను తీసుకొస్తున్నట్లు చెప్పి వాళ్ళే వీళ్ళు అంటూ దివి, విష్ణుప్రియ, రీతుచౌదరీ, భానుశ్రీని పరిచయం చేశాడు. ఇక ఈ నలుగురు కలిసి డాన్స్ చేస్తూ స్టేజి మీదకు వచ్చారు. "ఎక్కడైనా నలుగురు కలిసి డాన్స్ చేస్తారు కానీ వీళ్ళ నలుగురు వేరు" అన్నాడు ప్రదీప్. ఆ డైలాగ్ కి విష్ణు పగలబడి నవ్వింది. "మీరేం కంగారు పడకండి, విష్ణు నవ్వు జనరేటర్ శబ్దంలా ఉంటుంది" అని పంచ్ వేశాడు ప్రదీప్. ఆ నలుగురితో 'సర్కారు వారి పాట' పాడించాడు.
ఇక ఫైనల్ గా 'జీపీఎస్' అంటే ఫుల్ ఫార్మ్ ఏమిటి అని అడిగాడు ప్రదీప్. కానీ ఎవరూ ఆన్సర్ చెప్పలేక హైదరాబాద్ లో ఉన్న క్లబ్బుల పేర్లు చెప్పారు. "సారీ.. నలుగురు తెలివైన వాళ్ళను తెచ్చాను అనుకున్నా కానీ కాదు" అంటూ విష్ణు, రీతూ పరువు తీసేసాడు ప్రదీప్. ఈ మధ్య నిహారిక, నవదీప్, సదా, విశ్వక్ సేన్, సాయి పల్లవి, రానా, అడివి శేష్, శోభిత ఇలా ఎంతో మందితో ఈ గేమ్ షో ఆడించాడు ప్రదీప్. ప్రతీ ఎపిసోడ్ లో ఫోర్ రౌండ్స్ ఉంటాయి. ఫైనల్ రౌండ్ వరకు ఎవరు కరెక్ట్ గా ఆన్సర్స్ చెప్తూ ఆడతారో వాళ్ళు గెలిచినట్టు. ఇక ఈ షోకి బిగ్ స్క్రీన్ నుంచి కూడా చాలా మంది సెలెబ్రిటీస్ వచ్చి ఈ సర్కారు వారి పాటలో పార్టిసిపేట్ చేశారు. మరోవైపు ప్రదీప్ పాపులర్ డాన్స్ షో 'ఢీ 14'కి హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే.
Also Read