దసరాకు బిగ్ సర్ప్రైజ్.. ఒకే ఫ్రేమ్ లో తారక్, మహేష్!
on Sep 20, 2021
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో జెమిని టీవీలో ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. గతంలో 'బిగ్ బాస్'తో ఆకట్టుకున్న తారక్.. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతోనూ తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. అయితే ఈ షోపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జెమిని.. తారక్ హోస్ట్ చేస్తున్న ఈ షోకి రికార్డ్ స్థాయిలో రేటింగ్ తెప్పించాలన్న ఉద్దేశంతో తారక్ సన్నిహితులైన టాలీవుడ్ బడా సెలబ్రిటీలను రంగంలోకి దింపుతుంది.
తారక్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకి ఫస్ట్ గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చారు. తారక్, చరణ్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాతో వీరి ఫ్రెండ్ షిప్ మరింత బలపడింది. దీంతో తారక్ షో కోసం చరణ్ ని రంగంలోకి దింపారు నిర్వాహకులు. ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక రీసెంట్ గా టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివలను రంగంలోకి దింపింది జెమిని. ఈ ఎపిసోడ్ సోమవారం టెలికాస్ట్ కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటుంది.
ఇక దసరా స్పెషల్ ఎపిసోడ్ కోసం 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో నిర్వాహకులు సూపర్ స్టార్ మహేష్ బాబును తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం నాడు ఈ ఎపిసోడ్ షూట్ కూడా చేశారని సమాచారం. తారక్-మహేష్ కలిస్తే ఎపిసోడ్ రేటింగ్ ఏ స్థాయిలో దూసుకుపోతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఐపీఎల్, బిగ్ బాస్ షో, సీరియల్స్ ని తట్టుకొని మంచి రేటింగ్ సాధించాలంటే ఈ మాత్రం సెలబ్రిటీస్ ని రంగంలోకి దింపాలన్న ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read