స్పెషల్ డేకి `లైగర్` ఫస్ట్ గ్లింప్స్!
on Sep 16, 2021
`ఇస్మార్ట్ శంకర్`(2018)తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశారు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ప్రస్తుతం ఈ స్టార్ కెప్టెన్.. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో `లైగర్` చేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. పాన్ - ఇండియా మూవీగా రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. పూరీ జగన్నాథ్ పుట్టినరోజుని పురస్కరించుకుని సెప్టెంబర్ 28న `లైగర్` నుంచి స్పెషల్ వీడియో రాబోతోందని సమాచారం. ఇప్పటివరకు పోస్టర్స్ కే పరిమితమైన `లైగర్`కి సంబంధించి.. ఆ రోజు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసే దిశగా యూనిట్ ప్లాన్ చేస్తోందని బజ్. అంతేకాదు.. నయా రిలీజ్ డేట్ ని కూడా కన్ఫర్మ్ చేసే అవకాశముందంటున్నారు. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే ఈ నెల 28 వరకు వేచిచూడాల్సిందే.
కాగా, `లైగర్`లో విజయ్ దేవరకొండకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే నటిస్తోంది. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, మకరంద్ దేశ్ పాండే, అలీ, గెటప్ శ్రీను ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంస్థలు ఈ భారీ బడ్జెట్ మూవీని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాయి.