ప్రభాస్ చేతుల మీదుగా 'రొమాంటిక్' ట్రైలర్.. పూరి మార్క్ కనిపిస్తుంది!
on Oct 19, 2021
ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా అనిల్ పాడూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రొమాంటిక్'. 'పూరి కనెక్ట్స్' బ్యానర్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అంతేకాదు ఈ సినిమాకు స్టొరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా పూరీ జగన్నాథ్ అందించారు. ఈ మూవీ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైన రొమాంటిక్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
'రొమాంటిక్' ట్రైలర్ లో పూరి మార్క్ కనిపిస్తోంది. తమ మధ్య ఉన్న ఘాటు ప్రేమను మోహం అనుకునే ఇద్దరు ప్రేమికుల కథే రొమాంటిక్ మూవీ అని ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది. ఆకాష్, కేతిక మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. కేతిక తన అందచందాలతో అలరిస్తోంది. ఇక రమ్యకృష్ణ పోలీసాఫీసర్ గా కీలక పాత్రలో కనిపించింది. తాము లవ్ చేసుకోవట్లేదని హీరో, హీరోయిన్ ఇద్దరూ చెప్పడంతో.. లవ్ కాకపోతే ఏం చేసుకుంటున్నారే మీ ఇద్దరూ అని రమ్యకృష్ణ అడగగా.. ఏదోకటి చేసుకుంటాం మమ్మల్ని వదిలేయండి అంటూ కేతిక చెప్తుంది. మొత్తానికి రొమాంటిక్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. మ్యూజిక్ తో పాటు.. 'ఆడదానితో పెట్టుకుంటే సంకనాకిపోతావురరే' వంటి పూరి మార్క్ డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
రొమాంటిక్ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆకాష్- కేతిక జంట వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
Also Read