అనన్యపై ఎన్సీబీ ఫోకస్.. ఆందోళనలో పూరి టీమ్! ఎందుకో తెలుసా?
on Oct 22, 2021
గురువారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ముంబైలోని బాలీవుడ్ నటుడు చంకీ పాండే ఇంటికి వెళ్లారు. ఆయన కుమార్తె అనన్యా పాండేకు సమన్లు అందజేశారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎన్సీబీ ఆఫీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా తెలిపారు. అదే సమయంలో మరో ఎన్సీబీ టీమ్ షారుక్ ఖాన్ ఇంటికి వెళ్లారు. అదివరకు ఆర్యన్ ఖాన్ ఒక వర్థమాన తారతో చాటింగ్ చేశాడనీ, ఆ ఇద్దరూ డ్రగ్స్ గురించి డిస్కస్ చేశారనీ ముంబై కోర్టుకు వెల్లడించింది ఎన్సీబీ. ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ (షారుక్ కుమార్తె)లకు అనన్యా పాండే క్లోజ్ ఫ్రెండ్. ఆ ముగ్గురూ కలిసి తరచూ పార్టీలకూ, ఈవెంట్లకూ అటెండ్ అవుతుంటారు. ఇప్పుడు ఆర్యన్ వాట్సాప్లో చాటింగ్ చేసింది అనన్యా పాండే అని వెల్లడైంది.
గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా అనన్యను విచారించిన ఎన్సీబీ టీమ్ ఈరోజు ఉదయం 11 గంటలకు మరోసారి తమ ముందు విచారణకు రావాల్సిందిగా కోరింది. దీంతో క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో అనన్యా పాండే కూడా చిక్కుకునే అవకాశం ఉందంటూ ఆన్లైన్లో ప్రచారంలోకి వచ్చింది. అనన్యను ఎన్సీబీ అరెస్ట్ చేయవచ్చని కూడా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే, విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న 'లైగర్' ప్రాజెక్ట్ పరిస్థితి ఏమవుతుందంటూ ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో నిర్మాణమవుతున్న 'లైగర్' మూవీని పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్నాడు. బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్లో ఒకరైన కరణ్ జోహార్, పూరి జగన్నాథ్కు చెందిన పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అనన్యా పాండేపై ఎన్సీబీ ఫోకస్ పెట్టడంతో పూరి టీమ్ ఆందోళనలో మునిగి పోయిందంటున్నారు. ఒకవేళ అనన్య అరెస్ట్ అయితే, దాని ప్రభావం 'లైగర్' షూటింగ్పై పడి, షెడ్యూల్ డిస్టర్బ్ అవడం ఖాయం. ఈ సినిమా కోసం పూరి తన సంపాదన అంతా వెచ్చించాడని టాక్. ఏం జరుగుతుందో చూడాలి...
Also Read