సితారతో నవీన్ పొలిశెట్టి మూవీ కన్ఫామ్.. 'జాతిరత్నాల'ను మించి!
on Sep 15, 2021
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ నవీన్ పొలిశెట్టి నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసింది. ఈ ఏడాది 'జాతిరత్నాలు' సినిమాతో సంచలన విజయాన్ని అందుకొని క్రేజీ స్టార్ గా మారిపోయిన ఈ యంగ్ టాలెంటెడ్ హీరో.. మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి కలెక్షన్లు కొల్లగొట్టాలని చూస్తున్నాడు. అందుకే మళ్ళీ కామెడీనే నమ్ముకొని మరో సినిమా చేస్తున్నాడు.
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ లో నవీన్ ఓ సినిమా కమిట్ అయ్యాడు. అయితే స్టొరీ నచ్చక ఆ సంస్థ భారీ మొత్తంలో ఇచ్చిన అడ్వాన్స్ ని సైతం నవీన్ తిరిగి ఇచ్చేశాడని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడదే సంస్థతో నవీన్ సినిమా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. నవీన్ తో చేయబోతున్న సినిమా వివరాలను సితార ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను.. ఫార్చ్యూన్ 4 సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది.
గణేష్ ఉత్సవ్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మూవీని అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఇదొక ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ అని వీడియోలో తెలిపారు. ఈ చిత్రానికి నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. 'జాతిరత్నాలు'తో సంచలన విజయాన్ని అందుకున్న నవీన్.. ఈ సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
Also Read