రూ.300 కోట్ల బడ్జెట్ తో కృష్ణ వంశీ భారీ ప్రాజెక్ట్!
on Jul 3, 2022
ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. ఎందరో స్టార్స్ ఓటీటీలలో ప్రాజెక్ట్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో ఓ స్టార్ డైరెక్టర్ చేరనున్నారు. ఆయన ఏకంగా రూ.300 కోట్లతో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు.
'గులాబీ', 'నిన్నే పెళ్లాడతా', 'సిందూరం', 'అంతఃపురం', 'మురారి', 'ఖడ్గం' వంటి సినిమాలతో క్రియేటర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణ వంశీ చాలాకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 'రంగ మార్తాండ' సినిమా చేస్తున్న ఆయన.. నెక్స్ట్ ఓ భారీ ఓటీటీ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలియజేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓటీటీ ఎంట్రీపై ఆయన స్పందించారు. "ఓటీటీలో మనం ఏది అనుకుంటే అది తీసే స్వేచ్ఛ ఉంటుంది. నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరముండదు. ఓటీటీ కోసం ఓ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నా. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ప్రారంభిస్తా. ఇప్పుడే దీని గురించి చెప్పలేను కానీ పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. రూ.200 నుంచి రూ.300 వరకు బడ్జెట్ అవొచ్చు" అని కృష్ణ వంశీ చెప్పారు. మరి ఈ భారీ ప్రాజెక్ట్ ని కృష్ణ వంశీ ఎవరితో చేస్తారో చూడాలి.