ప్రభాస్, తారక్ మల్టీస్టారర్.. కరణ్ జోహార్ భారీ ప్లాన్!
on Jul 7, 2022
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన 'ఆర్ఆర్ఆర్'తో అసలుసిసలు మల్టీస్టారర్ మజా ఏంటో చూశారు ప్రేక్షకులు. ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్ కి సన్నాహాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది.
'బాహుబలి' ఫ్రాంచైజ్ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 'ఆదిపురుష్','సలార్', 'ప్రాజెక్ట్ k' వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక 'ఆర్ఆర్ఆర్'తో తారక్ కూడా నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన నటనతో అందరిని కట్టి పట్టేశాడు. ప్రస్తుతం కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తో వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాడు. పాన్ ఇండియా క్రేజ్ ఉన్న ప్రభాస్, తారక్ తో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడట.
ప్రభాస్, ఎన్టీఆర్ తో కరణ్ జోహార్ భారీ పాన్ ఇండియా యాక్షన్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నట్లు ఉమైర్ సందు ట్వీట్ చేశాడు. తన దగ్గర ఎటువంటి సమాచారం లేకపోయినా, కేవలం అటెన్షన్ కోసం ఇలాంటి ట్వీట్స్ చేస్తుంటాడని ఉమైర్ సందు మాటలను కొట్టిపడేస్తుండగా.. మరికొందరు మాత్రం నిజంగానే ఈ కాంబినేషన్ లో మల్టీస్టారర్ వస్తే సూపర్ ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read