వైష్ణవ్ మిస్.. మరి కృతి పరిస్థితేంటో!
on Oct 23, 2021
ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన రొమాంటిక్ డ్రామా `ఉప్పెన`తో తెలుగు తెరకు హీరోహీరోయిన్లుగా పరిచయమయ్యారు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి. మొదటి చిత్రంతోనే సంచలన విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. ఓవర్ నైట్ స్టార్స్ గా మారిపోయారు. ఆపై వరుసగా సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో.. వీరిద్దరి భవిష్యత్ ప్రాజెక్ట్ లపై ఎనలేని ఆసక్తి నెలకొంది.
ఈ క్రమంలోనే.. ఈ నెల 8న `కొండ పొలం`తో జనం ముందు నిలిచాడు వైష్ణవ్ తేజ్. ఈ చిత్రానికి, వైష్ణవ్ నటనకి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కినా.. బాక్సాఫీస్ ముంగిట ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది `కొండ పొలం`. దీంతో.. రెండో సినిమా విషయంలో నిరాశతప్పలేదు వైష్ణవ్ కి. ఇక కృతి శెట్టి విషయానికి వస్తే.. `శ్యామ్ సింగ రాయ్`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, `మాచర్ల నియోజక వర్గం`, `బంగార్రాజు`, `RAPO 19` చిత్రాలతో బిజీ అయిపోయింది. వీటిలో కృతి శెట్టి నటించిన రెండో తెలుగు సినిమాగా `శ్యామ్ సింగ రాయ్` క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న రిలీజ్ కానుంది. మరి.. రెండో చిత్రంతో వైష్ణవ్ సక్సెస్ ని మిస్ అయిన నేపథ్యంలో.. కృతి అయినా విజయపరంపరని కొనసాగిస్తుందేమో చూడాలి.
Also Read