మొగులయ్యకు ఘన సత్కారం.. కోటి రూపాయలు ప్రకటించిన సీఎం కేసీఆర్!
on Jan 28, 2022
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో తెలంగాణకు చెందిన దర్శనం మొగులయ్యకు పద్మశ్రీ పద్మశ్రీ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. అరుదైన 12 మెట్ల కిన్నెర వాయిద్యకారునిగా పేరుపొందిన ఆయన ఇటీవల 'భీమ్లా నాయక్' సినిమాలో పాట పాడటం ద్వారా పాపులారిటీ దక్కించుకున్నారు. తాజాగా మొగులయ్యను తెలంగాణ సీఎం కేసీఆర్ ఘనంగా సత్కరించి.. కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.
దర్శనం మొగులయ్య శుక్రవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసారు. ఈ సందర్భంగా మొగులయ్యను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగులయ్య అభినందనీయుడన్నారు. మొగులయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. పద్మశ్రీ మొగులయ్యకు హైదరాబాద్ లో నివాసయోగ్యమైన ఇంటిస్థలంతో పాటు నిర్మాణానికి అయ్యే ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయలను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.
దర్శనం మొగులయ్యమొగిలయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు. ఆయన 52 దేశాల ప్రతినిధుల ముందు తన 12 మెట్ల కిన్నెర గానంతో ప్రదర్శలను ఇచ్చాడు. మొగులయ్య జీవిత చరిత్ర ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా ఉంది. మొగులయ్య నాగర్కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకుల గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని సింగరేణి కాలనీ మురికివాడలో కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నారు. మొగులయ్య తొలిసారిగా 'భీమ్లా నాయక్' సినిమాలో "సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు" అనే పాట ద్వారా సినీరంగంలోకి వచ్చి, ఆ పాటతో మంచి గుర్తింపు అందుకున్నారు.
Also Read