ఆసుపత్రి పాలైన అడివి శేష్!
on Sep 20, 2021
'క్షణం', 'గూఢచారి', 'ఎవరు' సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు అడివి శేష్. అయితే ఇప్పుడు ఈ మినిమన్ గ్యారెంటీ హీరో ప్రస్తుతం షూటింగ్స్ లో పాల్గొనడం లేదని.. అనారోగ్యం పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది.
అడివి శేష్ కు డెంగ్యూ జ్వరం వచ్చింది. సడెన్ గా ప్లేట్ లెట్స్ పడిపోవడంతో ఆయన ఈ నెల 18న హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని సమాచారం. అడివి శేష్ ఆరోగ్యంపై డాక్టర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని.. త్వరలోనే ఆయన హెల్త్ కండీషన్ పై అధికారికంగా అప్డేట్ రానుందని తెలుస్తోంది.
అడివి శేష్ ప్రస్తుతం మేజర్, హిట్ 2, గూఢచారి 2 వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ఆసుపత్రి పాలవ్వడంతో ప్రస్తుతం ఈ షూటింగ్స్ కి బ్రేక్ పడింది.
Also Read