డెంగ్యూ నుంచి కోలుకున్న అడివి శేష్!
on Sep 27, 2021
డెంగ్యూ జర్వం నుంచి కొలుకుని.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి... ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నానని నటుడు అడివి శేష్ తెలిపారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని చెప్పారు. దాంతో వైద్యుల సూచనను పాటిస్తున్నట్లు చెప్పారు. తాను త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శేష్ కృతజ్ఞతలు తెలిపారు.
అనారోగ్యం నుంచి కొలుకున్న తర్వాత సోమవారం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. అడివి శేష్ ప్రకటనతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో పాటు రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య బాగా పడిపోయింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు ఆయన్ని తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా... ఆయనకు డెంగ్యూ జ్వరమని వైద్యులు నిర్థారించారు. నాటి నుంచి ఆ హాస్పిటల్లోని ఓ వైద్య బృందం ఆయన్ని నిరంతరం పర్యవేక్షించడంతో.. త్వరగా కొలుకున్నారు.
అడివి శేష్... 'మేజర్', నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న 'హిట్ 2' చిత్రాల్లో నటిస్తున్నారు. 'మేజర్' ద్విభాషా చిత్రంగా నిర్మితమవుతోంది. 2008లో ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో శోభిత ధూళిపాల, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ, రేవతి తదితరులు నటిస్తున్నారు.
Also Read