మరో పాన్ ఇండియా మూవీలో రష్మిక!!
on Jul 27, 2021
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఇటీవల ఆలియా భట్, కియారా అద్వానీ వంటి పేర్లు వినిపించాయి. అయితే తాజాగా రష్మికా మందన్న పేరు తెరమీదకు వచ్చింది.
నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ఓ వైపు సౌత్ లో సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం రష్మిక నటిస్తున్న చిత్రాలలో అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప' ఒకటి. అయితే ఇప్పుడు ఈ అమ్మడు మరో పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. చరణ్-శంకర్ ల ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా రష్మికను ఎంపిక చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం రష్మిక పుష్పతో పాటు తెలుగులో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీలో నటిస్తోంది. అలాగే మిషన్ మజ్ను, గుడ్ బై వంటి హిందీ చిత్రాల్లోనూ నటిస్తోంది.
Also Read