English | Telugu

బిగ్‌ బాస్ సీజ‌న్ 5కి గ్లామ‌ర‌స్‌ న్యూస్ రీడ‌ర్‌!

టీవీ న్యూస్ రీడ‌ర్స్‌కి బిగ్‌బాస్ రియాలిటీ షో కేరాఫ్ అడ్ర‌స్‌గా మారుతోంది. సీజ‌న్ 2లో టీవీ9కి చెందిన దీప్తి న‌ల్ల‌మోతు కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి గ‌ట్టి పోటీనిచ్చింది. ఆ త‌రువాత జ‌కీర్ ఎంట్రీ ఇచ్చాడు. మ‌ధ్య‌లోనే వెళ్లిపోయాడు.. కత్తి మ‌హేష్ కూడా ఇదే ఛాన‌ల్ నుంచి బిగ్ ‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆశించిన స్థాయిలో రాణించ‌లేక‌పోయాడు.

ఇదే ఛాన‌ల్ నుంచి ఎంట్రీ ఇచ్చింది దేవి నాగ‌వ‌ల్లి. సీజ‌న్ 4లో స్ట్రాంగ్‌గానే క‌నిపించినా పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూప‌లేక‌పోయింది. ఇప్పుడు ఇదే ఛాన‌ల్ నుంచి మ‌రో న్యూస్ రీడ‌ర్ బిగ్ ‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఆమే ప్ర‌త్యూష‌. గ‌త కొన్నేళ్లుగా ఆమె టీవీ9లో న్యూస్ రీడ‌ర్‌గా ప‌నిచేస్తోంది. జూన్‌లో ప్రారంభం కాబోతున్న సీజ‌న్‌ 5 కోసం ఆమెని కంటెస్టెంట్‌గా ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది.

న్యూస్ రీడ‌ర్‌గా వుంటూనే ప‌లు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌ల‌కు, సెల‌బ్రిటీల ఇంట‌ర్వ్యూల‌కు యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌త్యూష‌కు సెల‌బ్రిటీల‌తో మంచి ప‌రిచ‌యాలున్నాయి. సోష‌ల్ మీడియాలోనూ త‌న గ్లామ‌ర‌స్ స్టిల్స్‌ను షేర్ చేస్తూ ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. అవే ఆమెని బిగ్ ‌బాస్ సీజ‌న్ 5కి ఎంపిక‌య్యేలా చేసిన‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ప్ర‌తీ సీజ‌న్‌కి టీవీ9 నుంచి ఎవ‌రో ఒక‌రిని ఎంపిక చేస్తుండ‌టం కూడా ప్ర‌త్యూష‌కు క‌లిసివ‌చ్చిన‌ట్టుగా చెబుతున్నారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.