English | Telugu

శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫన్నీ wwf ఫైటింగ్ పోటీలు

శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడూ కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. ఇక ఇప్పుడు wwf తరహాలో ఒక ఫన్నీ ఫైటింగ్ తో వచ్చేసారు కమెడియన్స్ . "భార్యలు పారిపోయారని ఏడుస్తున్న భర్తలు, భర్తలను వదిలించుకుని పారిపోయే వచ్చిన భార్యలు" అనే కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు ఈ వారం. భర్త wwf లో కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళ భార్యలు మాత్రం హిమాలయాల్లో కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటారు. wwf లో వేసుకునే చెడ్డీలతో, బెల్టులతో వచ్చి ఫన్నీ రెజ్లింగ్ పోటీలు పెట్టుకుంటారు.ఇల్లీగల్ అఫైర్స్ కాండిడేట్స్ అంటూ పంచ్ ప్రసాద్ వాళ్ళందరి గురించి ఇంట్రడక్క్షన్ ఇస్తాడు.

తర్వాత రింగ్ లోకి వెళ్లిన ఆది, సన్నీ రెజ్లింగ్ చేసుకుంటూ మధ్యలో సన్నీ ఆదికి హెడ్ మసాజ్ బాడీ మసాజ్ చేస్తుంటాడు. ఆ సీన్ చూసేసరికి ఆ షోకి వచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ, సుధీర్ బాబు పడీ పడీ నవ్వుతారు. తర్వాత ఒక స్కూల్ నుంచి ఒక చిన్నారి వచ్చి నాటీ నరేష్ తో మ్యాజిక్ చేస్తుంది. ఆ మేజిక్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. తర్వాత ఆటో రాంప్రసాద్ సరిగా రెజ్లింగ్ చేయకపోయేసరికి నువ్వు చేతబడి చేస్తున్నావా ఫైట్ చేస్తున్నావా అంటూ ఫన్ క్రియేట్ చేసాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.