English | Telugu

21 న బిగ్ బాస్ సోనియా ఆకుల- యాష్ పెళ్లి

బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆకుల సోనియా హౌస్ నుంచి వచ్చాక రీసెంట్ గ యష్ పాల్ వీరగోని అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇక తానూ చేసుకోబోయే శ్రీవారిని తీసుకెళ్లి హీరో నాగార్జునని కలిసి పెళ్లి శుభలేఖ అందించి పెళ్ళికి రావాలంటూ ఆహ్వానించింది. "మా జీవితంలో స్పెషల్ డే .. మా వివాహానికి రావాలని నాగార్జునగారిని ఆహ్వానించాం" అంటూ ఈ వీడియోను పోస్ట్ చేశారు. నవంబర్‌లో వీరి నిశ్చితార్థం జరగ్గా ఈ నెల 21 న పెళ్లి చేసుకోబోతున్నారంటూ చెప్పారు. ఇక సోనియా చేసుకోబోయే అబ్బాయి విషయానికి వస్తే .. యష్ పాల్ సొంతూరు వరంగల్. యష్ కష్టపడి చదువుకుని అమెరికా వెళ్లి చాలా ఏళ్లు అక్కడ ఉద్యోగం చేశారు.

అమెరికాలో చదువు కోసం వెళ్లిన రోజుల్లో తనకి ఎదురైన ఇబ్బందులు మరొకరికి ఎదురు కాకూడదనే ఉద్దేశంతో 'ఫ్లయ్ హై' అని ఒక కన్సల్టెన్సీని స్థాపించారు. అలానే ఫ్లయ్ హై టూరిజం, విరాట్ ఫౌండేషన్ సంస్థలను నడుపుతున్నారు . ఈ వ్యవహారాలన్నింటినీ యష్ స్వయంగా చూసుకుంటున్నారు. ఇక యష్‌ ప్రొఫెషనల్ క్రికెటర్ కూడా. అండర్ 16, అండర్ 19 మ్యాచులు ఆడారు. లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ సహా అనేకమంది స్టార్ క్రికెటర్లతో యష్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కపిల్ దేవ్ యాష్ బర్త్ డేకి స్పెషల్ విషెస్ చెప్తూ వీడియో కూడా పంపించారు. ఇక యష్‌కి సంబంధించిన ఒక సంస్థలో సోనియా గతంలో పని చేసేది. అయితే యష్‌కి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. కానీ తన మొదటి భార్యకి విడాకులిచ్చి ఇప్పుడు సోనియాని లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు. ఈ విషయాన్ని సోనియానే స్వయంగా బిగ్‌బాస్ హౌస్‌లో ప్రేరణతో చెప్పింది. ఇక నెటిజన్స్ వీళ్ళ పెళ్ళికి విషెస్ చెప్తూ రిప్లైస్ ఇస్తున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.