English | Telugu

అన్ ప్రొఫెషనల్ ఎడిటింగ్ తో జనాల్ని మాయ చేసింది పాడుతా తీయగా సీజన్

సింగర్ ప్రవస్తి ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. రీసెంట్ గా ఆమె రెండు వీడియోస్ రిలీజ్ చేసింది. పాడుతా టీయగా షోలో తన ఎపిసోడ్ లో అసలు సునీత, చంద్రబోస్, కీరవాణి లేరు అంటూ చెప్పుకొస్తూనే ఉంది. ఆ ఎపిసోడ్ కచ్చితంగా చూడండి మీకే నిజం తెలుస్తుంది అంటూ ఆడియన్స్ కూడా చెప్పింది. ఐతే రీసెంట్ గా ప్రసారమైన ప్రవస్తి ఎపిసోడ్ చూస్తే అందులో జడ్జెస్ ముగ్గురూ కూర్చుని చప్పట్లు కొడుతూ కనిపించారు. దీంతో ఆడియన్స్ కి డౌట్ రావడంతో ప్రవస్తి మరో వీడియోని రిలీజ్ చేసింది. ఇదంతా అన్ ఎథికల్ గా ఎడిటింగ్ చేసి లేనిది ఉన్నట్టు చూపించారు అంటూ చెప్పుకొచ్చింది. ఈ ఎపిసోడ్ చూసాక తానే షాక్ కి గురైనట్టు చెప్పింది. "రియాలిటీ షో హిస్టరీలో ఇంత అన్ ఎథికల్ గా , అన్ ప్రొఫెషనల్ గా కంప్రెస్ చేసి ఈ వీడియో ఇలా వదులుతారు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.

అందులో అది ఈటీవీ. అందులో ఇలాంటివి జరుగుతాయని నేను అస్సలు అనుకోలేదు. కంప్రెస్ చేసి ఎడిట్ చేసి ఎక్కడిదో తీసుకొచ్చి క్లిప్స్ అతికిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశా. చాలా ఎడిట్ చేసినట్టు అనిపించింది అంటూ చాలా కామెంట్స్ వచ్చాయి నాకు. చంద్రబోస్ గారు కొంచెం సేపు కూడా లేరు. కీరవాణి గారు నాకేం సంబంధం లేదు అని లేచి వెళ్లిపోయారు. కీరవాణి గారివి ఎక్కడివో క్లాపింగ్ షాట్స్ వచ్చాయి. అవి ఎక్కడివో నాకు తెలీదు. ఎలిమినేషన్ ప్రాసెస్ లో నలుగురిలో నేను రేణు కుమార్ అన్న ఇద్దరమే మిగిలాం. ఏ జడ్జ్ ఎంత స్కోర్ ఇచ్చారు, ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారు అన్న క్లారిటీ కూడా ఏమీ ఇవ్వలేదు. మీరు కూడా ఆలోచించండి ఇంకేదైనా రియాలిటీ షోలో ఇలాగే చూసారు. ఎలిమినేషన్ ప్రాసెస్ మొత్తం నేను నవ్వుకుంటూనే ఉన్నాను. ఈ సీజన్ ఇంత ఘోరంగా జరుగుతున్నప్పుడు నేను ఇంకా వదిలేసాను. ఆడియన్స్ కి అర్థమవుతుందని నేను అనుకున్నాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. జనాల్ని ఇంత ఈజీగా ఫూల్స్ చేస్తారనుకోలేదు. ఎవరి మీద ఎలాంటి పర్సొనల్ గ్రజ్ లేదు. ఒక వేళా ఈ సీజన్ లో ఎవరైనా విన్ అయ్యుంటే పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని నేను అనుకోవడం లేదు. ఇక ఆ విన్నర్ కూడా ఆ నచ్చిన వాళ్ళే అవుతారు." అంటూ చెప్పుకొచ్చింది ప్రవస్తి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.