English | Telugu

అన్ ప్రొఫెషనల్ ఎడిటింగ్ తో జనాల్ని మాయ చేసింది పాడుతా తీయగా సీజన్

సింగర్ ప్రవస్తి ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. రీసెంట్ గా ఆమె రెండు వీడియోస్ రిలీజ్ చేసింది. పాడుతా టీయగా షోలో తన ఎపిసోడ్ లో అసలు సునీత, చంద్రబోస్, కీరవాణి లేరు అంటూ చెప్పుకొస్తూనే ఉంది. ఆ ఎపిసోడ్ కచ్చితంగా చూడండి మీకే నిజం తెలుస్తుంది అంటూ ఆడియన్స్ కూడా చెప్పింది. ఐతే రీసెంట్ గా ప్రసారమైన ప్రవస్తి ఎపిసోడ్ చూస్తే అందులో జడ్జెస్ ముగ్గురూ కూర్చుని చప్పట్లు కొడుతూ కనిపించారు. దీంతో ఆడియన్స్ కి డౌట్ రావడంతో ప్రవస్తి మరో వీడియోని రిలీజ్ చేసింది. ఇదంతా అన్ ఎథికల్ గా ఎడిటింగ్ చేసి లేనిది ఉన్నట్టు చూపించారు అంటూ చెప్పుకొచ్చింది. ఈ ఎపిసోడ్ చూసాక తానే షాక్ కి గురైనట్టు చెప్పింది. "రియాలిటీ షో హిస్టరీలో ఇంత అన్ ఎథికల్ గా , అన్ ప్రొఫెషనల్ గా కంప్రెస్ చేసి ఈ వీడియో ఇలా వదులుతారు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.

అందులో అది ఈటీవీ. అందులో ఇలాంటివి జరుగుతాయని నేను అస్సలు అనుకోలేదు. కంప్రెస్ చేసి ఎడిట్ చేసి ఎక్కడిదో తీసుకొచ్చి క్లిప్స్ అతికిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశా. చాలా ఎడిట్ చేసినట్టు అనిపించింది అంటూ చాలా కామెంట్స్ వచ్చాయి నాకు. చంద్రబోస్ గారు కొంచెం సేపు కూడా లేరు. కీరవాణి గారు నాకేం సంబంధం లేదు అని లేచి వెళ్లిపోయారు. కీరవాణి గారివి ఎక్కడివో క్లాపింగ్ షాట్స్ వచ్చాయి. అవి ఎక్కడివో నాకు తెలీదు. ఎలిమినేషన్ ప్రాసెస్ లో నలుగురిలో నేను రేణు కుమార్ అన్న ఇద్దరమే మిగిలాం. ఏ జడ్జ్ ఎంత స్కోర్ ఇచ్చారు, ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారు అన్న క్లారిటీ కూడా ఏమీ ఇవ్వలేదు. మీరు కూడా ఆలోచించండి ఇంకేదైనా రియాలిటీ షోలో ఇలాగే చూసారు. ఎలిమినేషన్ ప్రాసెస్ మొత్తం నేను నవ్వుకుంటూనే ఉన్నాను. ఈ సీజన్ ఇంత ఘోరంగా జరుగుతున్నప్పుడు నేను ఇంకా వదిలేసాను. ఆడియన్స్ కి అర్థమవుతుందని నేను అనుకున్నాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. జనాల్ని ఇంత ఈజీగా ఫూల్స్ చేస్తారనుకోలేదు. ఎవరి మీద ఎలాంటి పర్సొనల్ గ్రజ్ లేదు. ఒక వేళా ఈ సీజన్ లో ఎవరైనా విన్ అయ్యుంటే పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని నేను అనుకోవడం లేదు. ఇక ఆ విన్నర్ కూడా ఆ నచ్చిన వాళ్ళే అవుతారు." అంటూ చెప్పుకొచ్చింది ప్రవస్తి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.