English | Telugu
దామిణి ఎలిమినేషన్.. అమర్ దీప్ జస్ట్ మిస్!
Updated : Sep 24, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో మూడవ వారం సింగర్ దామిణి ఎలిమినేట్ అయింది. ఓటింగ్ లో చివరి ముగ్గురిలో అమర్ దీప్, శుభశ్రీ, దామిణి ఉండగా.. దామణి ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది. శనివారం జరిగిన ఎపిసోడ్ నామినేషన్లో ఉన్న ప్రిన్స్ యావర్ సేవ్ అయ్యాడు. ఇక ఆరుగురు ఉండగా మొదట రతిక రోజ్ సేవ్ అయింది. ఆ తర్వాత ప్రియాంక జైన్, శోభా శెట్టి సేవ్ అయ్యారు.
అలా ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ.. చివరగా అమర్ దీప్, శుభశ్రీ, దామిణి మిగిలారు. ఓటింగ్ లో అతి తక్కువ ఓటింగ్ వీరికే దక్కింది. సీరియల్ ఫ్యాన్స్ అమర్ దీప్ కి లేకుంటే ఈ రోజు దామిణి ప్లేస్ లో అతడే ఎలిమినేట్ అయ్యేవాడు. ఎందుకంటే అసలు మూడవ వారం అతని ఆటనే లేదు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ని తన సీరియల్ బ్యాచ్ ఫ్రెండ్ అయినటువంటి ప్రియాంక జైన్ కోసం త్యాగం చేశాడు అమర్ దీప్. దాంతో అతడిపై ప్రేక్షకులకు ఒక నెగెటివ్ ఇంపాక్ట్ ఏర్పడింది. ఓటింగ్ శాతం పూర్తిగా పడిపోవడంతో చివరి నుండి మూడవ స్థానంలో అమర్ దీప్ మిగిలాడు. ఇక నాగార్జున సేవ్ అని అనడంతోనే ఊపిరి పీల్చుకున్నాడు అమర్ దీప్. జస్ట్ మిస్ అయ్యాడని స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఆ తర్వాత శుభశ్రీ, దామిణి ఇద్దరు మిగలగా.. రెండు పడవలు తీసుకొచ్చి వారి ముందు ఉంచారు బిగ్ బాస్. వాటిలో ఏ ఏ పడవ అయితే పేలిపోతుందో వారు ఎలిమినేట్ అని నాగార్జున చెప్పగా.. దామిణి పడవ పేలిపోయింది. ఇక నాగార్జున యూ ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పేసి.. హౌజ్ లో వారికి గుడ్ బై చెప్పేసి వచ్చేయమన్నాడు.
స్టేజ్ మీదకి వచ్చిన దామిణి.. అసలు ఎక్స్ పెక్ట్ చేయలేదని, ఇంకా ముందుకి వెళ్దామని అనుకున్నా అని నాగార్జునతో అంది. తన జర్నీ వీడియోని చూసి ఎమోషనల్ అయింది దామిణి. అందరూ ఏదో సాధించడానికి వచ్చారుని గిన్నెలు తోమడానికి రాలేదని ప్రియాంక జైన్ అన్న మాటలు అందరిని ఆలోచించేలా చేశాయి. ఆ తర్వాత మోస్ట్ ఎమోషనల్ అయింది దామిణి. ఒక్కో కంటెస్టెంట్ కి ఒక సలహా ఇచ్చి ఆ బెలూన్ ని పగులగొట్టాలని చెప్పాడు నాగార్జున. సగం సగం వినకు. ఫుల్ గా విను రతిక అని తనకి సలహా ఇచ్చింది దామణి. కొన్ని బౌండరీస్ పెట్టుకున్నాడని, సేఫ్ గేమ్ ఆడుతున్నాడని, హ్యూమర్ ఒక్కటి ఉంటే సరిపోదని టేస్టీ తేజకి సలహా ఇచ్చింది దామిణి. ఇక సీరియల్ బ్యాచ్ గురించి.. మీరు ముగ్గురు బయట సీరియల్ ఫ్రెండ్స్ కావొచ్చు కానీ ఈ హౌజ్ లో అందరితో కలిసి ఉండాలి. మీరు ముగ్గురికి ఫేవరెటిజం చూపిస్తే సరిపోదని సలహా ఇచ్చింది దామణి. మీరెక్కడో కొందరినే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నట్టు అనిపించిందని శివాజీతో దామణీ అనగా.. "నువ్వు ఎన్ని చెప్పిన గాని ఇప్పుడు వర్కవుట్ అవదని, నేను ఏం అయిన తప్పు మాట్లాడానా లేదా, వెళ్ళి అన్ని ఎపిసోడ్ లు చెక్ చేసుకో అమ్మ'' అని దామిణితో శివాజీ అన్నాడు. ఆ తర్వాత అందరికి సలహాలిచ్చి ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోయింది సింగర్ దామిణి.
