English | Telugu

నా పుట్టింటికి ఇక సెలవు.. ఎమోషనల్ ఐన శ్రద్ధా

ముంబైలోని తన పుట్టింటి నుంచి హైదరాబాద్ లోని అత్తింటికి బయల్దేరి వెళ్ళింది విశ్వా అండ్ ఫామిలీ. సెకండ్ డెలివరీ కోసం శ్రద్దా తన పుట్టింటికి వచ్చి నాలుగు నెలలైపోయింది. ఇక ఇప్పుడు పిల్లాడికి రెండు నెలలు వచ్చేసరికి తన పుట్టింటికి వెళ్ళడానికి అందరి లగేజెస్ ని సర్దేసింది. హైదరాబాద్ నుంచి ముంబైకి తన భర్త విశ్వాని వదిలి పెట్టి వచ్చినప్పుడు ఎమోషనల్ అయ్యింది. ఇక ఇప్పుడు తన అమ్మానాన్నను వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు కూడా మాట్లాడలేక కన్నీళ్లు పెట్టుకుంది శ్రద్దా. ఇక పెద్ద కొడుకు ర్యాన్ కూడా స్కూల్ కి వెళ్లడం మానేసాడు. దాంతో టీచర్స్ శ్రద్దాకి వాట్సాప్ లో నోట్స్ పెట్టడం వంటివి చేసేసరికి ఇంట్లోనే వర్క్ చేయించిందట శ్రద్దా. ఇక ఫస్ట్ టైం కంప్లీట్ ఫామిలీ ఫ్లయిట్లో వెళ్తున్నట్టు చెప్పాడు విశ్వా. అలాగే ఫామిలీని వదిలి వెళ్ళేటప్పుడు ఆ బాండింగ్ ని అలాగే ఫ్లయిట్ లో వెళ్ళేటప్పుడు మూమెంట్స్ ని అన్ని కాప్చర్ చేస్తాను అని చెప్పాడు.

ఇక శ్రద్దా తన తల్లిని వదిలి వెళ్ళేటప్పుడు తనను బాగా చూసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పి ఏడ్చేసింది. ఆమె కన్నీళ్లు తుడుస్తూ శ్రద్దా వాళ్ళ అమ్మ కూడా కన్నీళ్లు పెట్టేసుకుంది. ఇక శ్రద్దా తన తల్లి కాళ్లకు దణ్ణం పెడదామనుకుంది కానీ పెట్టనివ్వలేదు. అమ్మా, నాన్న కాళ్ళు స్వర్గానికి ద్వారాలు అంటారు...పర్లేదు మీ కాళ్ళకు దణ్ణం పెట్టుకోనివ్వండి అని శ్రద్దా చెప్పగా.. నో అని చెప్పేసింది శ్రద్దా వాళ్ళ అమ్మ. తర్వాత వాళ్ళ నాన్నను హగ్ చేసుకుని ఏడ్చేసింది శ్రద్దా. అలా చివరికి ఫామిలీతో పాటు చుట్టాలు, ఫ్రెండ్స్ అంతా వచ్చి ఎయిర్ పోర్ట్ లో దింపారు శ్రద్దగా ఫామిలీని. అలా శ్రద్దా ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేసింది. ఇక ఈమె తన ఛానల్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.