English | Telugu
రౌడీకి డబ్బులిచ్చిన శైలేంద్ర మాస్టర్ ప్లాన్ అదేనా?
Updated : Sep 26, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -877 లో.. జగతి ఎలాగైనా రిషితో నిజం చెప్పాలని అనుకొని రిషికి ఫోన్ చేస్తుంది. కానీ జగతి చేస్తుందని రిషి ఫోన్ కట్ చేస్తుంటాడు. అయిన జగతి మళ్ళీ మళ్ళీ చేసేసరికి రిషి కోపంగా లిఫ్ట్ చేసి మాట్లాడుతాడు. నీతో మాట్లాడాలి. చాలా నిజాలు కలిసి చెప్పాలని జగతి అనగానే.. లేదు నేను రానని రిషి చెప్తాడు.
నేను చెప్పేది వినే సిచువేషన్ లో రిషి లేడు. ఇప్పుడు నేనేం చెయ్యాలని జగతి బాధపడుతుంది. కాసేపటికి పేపర్ పై జరిగింది మొత్తం జగతి రాస్తుంది. శైలేంద్ర చేసిన కుట్రలు అన్ని లెటర్ లో రాస్తుంది. మరొక వైపు రిషికి ఏంజిల్ ఫోన్ చేసి.. మేం వారం రోజులు ఊరు వెళ్తున్నాం, కాలేజీ జాగ్రత్త అని చెప్తుంది. మరుసటి రోజు ఉదయం రిషి కాలేజీకి వెళ్తాడు. డల్ గా ఏదో ఆలోచిస్తున్నట్లు ఉండడం గమనించిన వసుధార.. ఏమైందని అడుగుతుంది. కాలేజీ లో ఏమైన ప్రాబ్లమ్ ఉందా? మీ మేడమ్ ఫోన్ చేసారా అని వసుధారని రిషి అడుగుతాడు. నాకేం ఫోన్ చెయ్యలేదు అని వసుధార అనగానే నాకు ఫోన్ చేసిందని రిషి చెప్తాడు. మరొక వైపు ఒక అబ్బాయికి తను రాసిన లెటర్ ని ఇచ్చి పోస్ట్ చెయ్యమని చెప్తుంది జగతి. అప్పుడే మహేంద్ర వచ్చి ఏంటని అడుగుతాడు. రిషి నాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. అందుకే రిషి దగ్గర దాచిన నిజాలన్ని ఆ లెటర్ లో రాసానని మహేంద్రతో చెప్పడం శైలేంద్ర వింటాడు. మరొక వైపు ఎందుకు జగతి మేడమ్.. నాతో మాట్లాడాలని అనుకున్నారు. ఒకసారి కలిసి మాట్లాడదామని ఎందుకు అన్నారని జగతికి ఫోన్ చేసి రిషి అడుగుతాడు. ఫోన్ లో కాదు కలిసి మాట్లాడుతా అని జగతి అనగానే.. రిషి సరే అంటాడు.
మరొకవైపు రిషికి పిన్ని నిజం చెప్పబోతున్నా అని సంబరపడిపోతున్నావా? నీకు ఆ అవకాశం ఇవ్వనని శైలేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత శైలేంద్ర రౌడీని కలిసి అతనికి డబ్బులు ఇస్తాడు. రౌడీతో శైలేంద్ర మాట్లాడడం ధరణి చూస్తుంది.. ఆ తర్వాత అతనికి మీరు డబ్బులు ఎందుకు ఇచ్చారు? ఏం చేస్తున్నారని శైలేంద్రని ధరణి అడుగుతుంది. నీకు అనవసరమంటు ధరణిపై శైలేంద్ర కొప్పడతాడు. ఆ తర్వాత వసుధారకి ధరణి ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.