English | Telugu

రౌడీకి డబ్బులిచ్చిన శైలేంద్ర మాస్టర్ ప్లాన్ అదేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -877 లో.. జగతి ఎలాగైనా రిషితో నిజం చెప్పాలని అనుకొని రిషికి ఫోన్ చేస్తుంది. కానీ జగతి చేస్తుందని రిషి ఫోన్ కట్ చేస్తుంటాడు. అయిన జగతి మళ్ళీ మళ్ళీ చేసేసరికి రిషి కోపంగా లిఫ్ట్ చేసి మాట్లాడుతాడు. నీతో మాట్లాడాలి. చాలా నిజాలు కలిసి చెప్పాలని జగతి అనగానే.. లేదు నేను రానని రిషి చెప్తాడు.

నేను చెప్పేది వినే సిచువేషన్ లో రిషి లేడు. ఇప్పుడు నేనేం చెయ్యాలని జగతి బాధపడుతుంది. కాసేపటికి పేపర్ పై జరిగింది మొత్తం జగతి రాస్తుంది. శైలేంద్ర చేసిన కుట్రలు అన్ని లెటర్ లో రాస్తుంది. మరొక వైపు రిషికి ఏంజిల్ ఫోన్ చేసి.. మేం వారం రోజులు ఊరు వెళ్తున్నాం, కాలేజీ జాగ్రత్త అని చెప్తుంది. మరుసటి రోజు ఉదయం రిషి కాలేజీకి వెళ్తాడు. డల్ గా ఏదో ఆలోచిస్తున్నట్లు ఉండడం గమనించిన వసుధార.. ఏమైందని అడుగుతుంది. కాలేజీ లో ఏమైన ప్రాబ్లమ్ ఉందా? మీ మేడమ్ ఫోన్ చేసారా అని వసుధారని రిషి అడుగుతాడు. నాకేం ఫోన్ చెయ్యలేదు అని వసుధార అనగానే నాకు ఫోన్ చేసిందని రిషి చెప్తాడు. మరొక వైపు ఒక అబ్బాయికి తను రాసిన లెటర్ ని ఇచ్చి పోస్ట్ చెయ్యమని చెప్తుంది జగతి. అప్పుడే మహేంద్ర వచ్చి ఏంటని అడుగుతాడు. రిషి నాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. అందుకే రిషి దగ్గర దాచిన నిజాలన్ని ఆ లెటర్ లో రాసానని మహేంద్రతో చెప్పడం శైలేంద్ర వింటాడు. మరొక వైపు ఎందుకు జగతి మేడమ్.. నాతో మాట్లాడాలని అనుకున్నారు. ఒకసారి కలిసి మాట్లాడదామని ఎందుకు అన్నారని జగతికి ఫోన్ చేసి రిషి అడుగుతాడు. ఫోన్ లో కాదు కలిసి మాట్లాడుతా అని జగతి అనగానే.. రిషి సరే అంటాడు.

మరొకవైపు రిషికి పిన్ని నిజం చెప్పబోతున్నా అని సంబరపడిపోతున్నావా? నీకు ఆ అవకాశం ఇవ్వనని శైలేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత శైలేంద్ర రౌడీని కలిసి అతనికి డబ్బులు ఇస్తాడు. రౌడీతో శైలేంద్ర మాట్లాడడం ధరణి చూస్తుంది.. ఆ తర్వాత అతనికి మీరు డబ్బులు ఎందుకు ఇచ్చారు? ఏం చేస్తున్నారని శైలేంద్రని ధరణి అడుగుతుంది. నీకు అనవసరమంటు ధరణిపై శైలేంద్ర కొప్పడతాడు. ఆ తర్వాత వసుధారకి ధరణి ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.