English | Telugu

జగతి, మహేంద్రలు ఎందుకు ఆ కాలేజీకి వెళ్తున్నారో కనిపెట్టిన శైలేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -812 లో.. కాలేజీలో రిషి ఇచ్చే సెమినార్ కి వెళ్లాలని వసుధార రెడీ అయి హాల్లోకి వస్తుంది. నేను కూడా కాలేజీకి వస్తాను సర్ అని విశ్వనాథ్ ని వసుధార అడుగుతుంది. ఇంకా నొప్పి తగ్గలేదు కదా అని విశ్వనాథ్ అంటాడు. ఇంకా మీరు పూర్తిగా సరిగా నడవలేకపోతున్నారు. వద్దని రిషి అంటాడు. ఏం పర్లేదు సర్ వస్తానని వసుధార రిక్వెస్ట్ చేస్తుంది.

ఆ తర్వాత వసుధార కాలేజీకి రావడానికి రిషి, విశ్వనాథ్ లు ఒప్పుకుంటారు. విశ్వనాథ్ ఏంజిల్ ని పిలిచి నువ్వు కూడా కాలేజీకి రావాలి, తనకి సాయంగా ఉండమని విశ్వనాథ్ చెప్పగా.. ఏంజెల్ సరేనని అంటుంది. అందరూ కాలేజీకి బయల్దేరుతారు. కార్ లో వెళ్తుండగా రిషి ఇండైరెక్ట్ గా వసుధారకి జాగ్రత్తలు చెప్తాడు. నాకెందుకు చెప్తున్నావ్ వసుధార ఇక్కడే ఉంది కదా తనకే చెప్పమని రిషితో ఏంజిల్ అంటుంది. ఏంజెల్ కార్ ఆపమని చెప్పి విశ్వనాథ్ ని వెనక్కి, వసుధారని రిషి పక్కకి కూర్చోమంటుంది. ఇప్పుడు ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు కదా మాట్లాడుకోండని ఏంజిల్ అంటుంది. ఏం తిన్నారు సర్ అని వసుధార అడుగుతుంది. దోశ తిన్న అని రిషి అంటాడు.

ఎన్ని తిన్నారని వసు అడుగుతుంది. పధ్నాలుగు తిన్న అని రిషి వెటకారంగా అంటాడు. రిషి వాళ్ళు కాలేజీకి వెళ్ళగానే పాండియన్ వచ్చి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని చెప్తాడు. కాలేజీ ప్రిన్సిపాల్ తో రిషి సెమినార్ గురించి మాట్లాడతాడు. వచ్చే గెస్ట్ లను ఇంప్రెస్స్ చేసి సెమినార్ గురించి గొప్పగా చెప్పాలని ప్రిన్సిపాల్ అంటాడు. అది నేను చూసుకుంటా అని రిషి అంటాడు. ఆ తర్వాత మేడం మీరు అక్కడ కూర్చోండని వసుధారకి రిషి చెప్తాడు. ఏంజిల్ నువ్వు కూడా వసుధారా మేడంతోనే ఉండమని రిషి కేరింగ్ చూపించేసరికి ఏంజిల్ కి డౌట్ వస్తుంది. వసుధార రాకముందు వేరేలా ఉన్నావ్.. ఇప్పుడు వేరేలా ఉన్నావ్. మీ మధ్య ఏదైనా ఉందా అని రిషిని ఏంజిల్ అడుగుతుంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టైం కాదు సెమినార్ టైం అని ఏంజిల్ తో రిషి అంటాడు...

మరొక వైపు జగతి, మహేంద్ర ఇద్దరు రిషి ఉన్న కాలేజీ కి వెళ్తున్నారని తెలిసి వాళ్ళ కంటే ముందు శైలేంద్ర ఆ కాలేజీకి వెళ్తాడు. అసలు పిన్ని బాబాయ్ ఇద్దరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారని లోపలికి వెళ్తాడు. అక్కడ వసుధారని చూసి షాక్ అవుతాడు శైలేంద్ర. వసుధారని కలవడానికి పిన్ని బాబాయ్ వస్తున్నారా? ఈ ముగ్గురు కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారని శైలేంద్ర ఆలోచిస్తుంటాడు. మరొకవైపు రిషి ఉన్న కాలేజీకి జగతి, మహేంద్ర వస్తుంటారు. అసలు అనుకోకుండా కాలేజీ వెళ్లినట్లు మనం అక్కడ ఉండాలని జగతికి మహేంద్ర చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.