English | Telugu

మేం కలిసి స్టెప్పులేస్తే మామూలుగా ఉండదు!

డాన్స్ అంటే బుల్లితెరపై ముందుగా గుర్తొచ్చేది శేఖర్ మాస్టర్. ఆయన గురించి చెప్పడం కన్నా ఆయన కోరియోగ్రఫీ చేసిన డాన్స్ స్టెప్స్ చూస్తే చాలు ఆయన ఎంత టాలెంటెడ్ పర్సనో అర్థమైపోతుంది. ఆయన ఎప్పుడో తన కూతురు సాహితి, కొడుకు విన్నీని బుల్లితెరకు పరిచయం చేసేసాడు. విన్నీ సిల్వర్ స్క్రీన్ మీద కూడా ఎంట్రీ ఇచ్చేసాడు. ఇక శేఖర్ మాస్టర్ తన పిల్లలకు నచ్చిందే చేస్తూ ఉంటాడు. వాళ్ళ డాన్సులు చూసి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు.

సాహితి, విన్నీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. వాళ్ళ డాన్స్ లు ఫుల్ వైరల్ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు శేఖర్ మాస్టర్ కూడా వాళ్ళతో కలిసి డాన్స్ స్టెప్స్ వేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు మూవీ 'సర్కారు వారి పాట' మూవీ నుంచి "కమాన్ కమాన్ కళావతి" సాంగ్ కి పిల్లలతో కలిసి స్టెప్పులు వేశాడు శేఖర్ మాస్టర్. అలా ఈ ముగ్గురు చేసిన ఈ డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శేఖర్ మాస్టర్ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి ఇప్పుడు 'డాన్స్ ఐకాన్' షోలో జడ్జిగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ఈ షోలో కంటెస్టెంట్స్ తో కలిసి, ఈ షో కో-ఓనర్ శ్రీముఖి తో కలిసి వేసే స్టెప్పులు చూసి మైండ్ బ్లాక్ ఐపోతుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.